ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫెన్సింగ్‌ రాళ్ల ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-07-27T04:46:58+05:30

ఫెన్సింగ్‌ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

మృతి చెందిన చంద్ర ఓబులరెడ్డి, హుసేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, జూలై 26: ఫెన్సింగ్‌ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని నేరేళ్లవాగు సమీపంలో సోమవారం జరిగింది. ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాల మేరకు... కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్‌ ఫెన్సింగ్‌ రాళ్ల లోడుతో పామూరుకు బయలుదేరింది. గ్రామ సమీపంలోనినేరెళ్లవాగులో అదుపు తప్పి ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడింది.  ప్రొద్దుటూరు మండలం కాకిరేణిపల్లికు చెందిన ఉండేల చంద్రఓబుల్‌రెడ్డి (38), సుంకేశుల పెద్దహుస్సేన్‌ (45) అనే వ్యక్తులు రాళ్లపై కూర్చొని ఉన్నారు. ప్రమాదంలో రాళ్ల కింద పడి మృతి చెందారు. ట్రాక్టర్‌ను తోలుతున్న డ్రైవర్‌ గుత్తి మస్తాన్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో రాళ్లను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. 

Updated Date - 2021-07-27T04:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising