అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-09-19T05:00:55+05:30
మండల పరిఽధిలోని యార్లపాడు వాసి రైతు వై.నాగమల్లారెడ్డి(40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
పెండ్లిమర్రి, సెప్టెంబరు 18: మండల పరిఽధిలోని యార్లపాడు వాసి రైతు వై.నాగమల్లారెడ్డి(40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్థుల కథ నం మేరకు వివరాల్లోకెళితే.... ఈ నెల 14న నాగమల్లారెడ్డి ఇంటి నుంచి బయటకు వె ళ్లి తిరిగి రాలేదన్నారు. శనివారం గ్రామ స మీప పొలాల్లో దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ట్లు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య విజయభారతి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎ్సఐ రమణ తెలిపారు.
Updated Date - 2021-09-19T05:00:55+05:30 IST