కళాశాలలకు నిధుల విడుదలపై హర్షం
ABN, First Publish Date - 2021-05-06T05:09:43+05:30
జిల్లాలోని పలు కళాశాలలకు నిధులు విడుదల చేయడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
కడప(ఎడ్యుకేషన్), మే 5: జిల్లాలోని పలు కళాశాలలకు నిధులు విడుదల చేయడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు వైఎ్సఆర్ ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి రూ.66 కోట్ల నిధుల మంజూరు, రెండు టీచింగ్ పోస్టులు, అవుట్సోర్సింగ్ విధానంలో ఆరు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చారని తెలిపారు. అలాగే వేంపల్లెలో ప్రభుత్వ డిగీ క్రళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డికి, నిధుల సాధనకు కృషి చేసిన ఎంపీ అవినా్షరెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2021-05-06T05:09:43+05:30 IST