ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ సుధాకర్‌ మరణం ప్రభుత్వ మానసిక హత్య

ABN, First Publish Date - 2021-05-23T05:19:17+05:30

డాక్టర్‌ సుధాకర్‌ మరణం ప్రభుత్వ మానసిక హత్య అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగంగా అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తెలిపారు.

మాట్లాడుతున్న పంతగాని నరసింహప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌

రైల్వేకోడూరు, మే 22: డాక్టర్‌ సుధాకర్‌ మరణం ప్రభుత్వ మానసిక హత్య అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగంగా అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ సుధాకర్‌ మరణం చాలా బాఽధాకరం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న పైశాచిక ప్రేమకు నిదర్శనం డాక్టర్‌ సుధాకర్‌ మరణం అన్నారు. కరోనా సమయంలో సుధాకర్‌ సేవలు అందించారన్నారు. ఎన్‌95 మాస్కులు, గ్లౌజులు సమకూర్చాలని నిలదీసినందుకు అక్రమ కేసులు బనాయించిందన్నారు. చిత్రహింసలకు గురిచేసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని పోలీసుల చేత అణిచివేతకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను విధుల నుంచి తొలగించారని తెలిపారు.  ప్రభుత్వం వెంటనే సుధాకర్‌ కుటుంబానికి కోటి రూపాయలు పరిహరం ఇవ్వాలని డిమాండు చేశారు.  దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-23T05:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising