అనుమానాస్పద స్థితిలో జిల్లా వాసి మృతి
ABN, First Publish Date - 2021-01-21T05:12:52+05:30
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కడప నగరం నాగరాజుపేటకు చెందిన కంతూరి గంగాధర్ బుధవారం బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
సర్పవరం జంక్షన్, జనవరి 20: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కడప నగరం నాగరాజుపేటకు చెందిన కంతూరి గంగాధర్ బుధవారం బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గంగాధర్ వాకలపూడిలో న్యూ జెమిని ఆయిల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఏడాదిగా వాకలపూడిలోని రామకృష్ణనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అతడు బాత్రూమ్లో మృతిచెందినట్టు వీఆర్వో ముసలయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం ఎస్ఐ ఎస్.శంకర్ సంఘటనా స్థలానికి వెళ్లి గంగాధర్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించామని, మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-01-21T05:12:52+05:30 IST