ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో జిల్లా వాసి మృతి

ABN, First Publish Date - 2021-01-21T05:12:52+05:30

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడిలో కడప నగరం నాగరాజుపేటకు చెందిన కంతూరి గంగాధర్‌ బుధవారం బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

గంగాధర్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, జనవరి 20: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడిలో కడప నగరం నాగరాజుపేటకు చెందిన కంతూరి గంగాధర్‌ బుధవారం బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గంగాధర్‌ వాకలపూడిలో న్యూ జెమిని ఆయిల్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఏడాదిగా వాకలపూడిలోని రామకృష్ణనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అతడు బాత్‌రూమ్‌లో మృతిచెందినట్టు వీఆర్వో ముసలయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం ఎస్‌ఐ ఎస్‌.శంకర్‌ సంఘటనా స్థలానికి వెళ్లి గంగాధర్‌ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించామని, మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-21T05:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising