బద్వేలులో కాంగ్రె్సదే గెలుపు
ABN, First Publish Date - 2021-10-18T05:37:48+05:30
బద్వేలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
బద్వేలు, అక్టోబర్ 17 : బద్వేలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, రాష్ట్ర ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీకి ఉప ఎన్నికలలో ఓటర్లు బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలని కోరారు. సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కమలమ్మ హయాంలోనే అభివృద్ధి
బద్వేలు రూరల్, అక్టోబరు 17: బద్వేలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కమలమ్మ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్ఏ.సత్తార్లు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిద్ధవటం రోడ్డులో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలంటూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ అజ్మతుల్లా, బండి జకరయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు మహబూబ్బాష, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-18T05:37:48+05:30 IST