అనూషను హత్య చేశారంటూ ఆందోళన
ABN, First Publish Date - 2021-09-17T05:24:40+05:30
అనూ షను కుటుంబ సభ్యులే హత్య చేసి విద్యుత్ షాక్ అని నాట కా లు ఆడుతున్నారంటూ మృతు రాలి బంధువులు ఆందోళనకు దిగారు.
వేముల, సెప్టెంబరు 16: అనూ షను కుటుంబ సభ్యులే హత్య చేసి విద్యుత్ షాక్ అని నాట కా లు ఆడుతున్నారంటూ మృతు రాలి బంధువులు ఆందోళనకు దిగారు. వేముల క్రిస్టియన్ లైన్ లో బుధవారం రాత్రి విద్యుత్ షాక్తో ఇల్లూరు అనూష మృతి చెందిన విషయం విధితమే. అయి తే తమ సోదరి మృతిపై అను మానాలున్నాయని మృతురాలి కుటుంబీకులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పి, మృతురాలు సోదరి స్వర్ణలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బుధవారం రాత్రి సర్దుబాటైన ఆందోళన గురువారం ఉదయం తిరిగి మొదలైంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆస్పత్రి వద్ద మృతురాలు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పెద్దమనుషులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Updated Date - 2021-09-17T05:24:40+05:30 IST