ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త కనిపించడంలేదని ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-02-27T05:21:16+05:30

బద్వేలు మున్సిపాలిటీలోని 29వ వార్డు నివాసి ఈశ్వరయ్య కన్పించడంలేదని ఆయన భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్‌ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈశ్వరయ్య 29 వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. మార్చి నెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంది.

అదృశ్యమైన బద్వేలు 29వ వార్డు టీడీపీ అభ్యర్థి ఈశ్వరయ్య (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీసీవారే కిడ్నాప్‌ చేశారని టీడీపీ ఆరోపణ

బద్వేలు, ఫిబ్రవరి 26: బద్వేలు మున్సిపాలిటీలోని 29వ వార్డు నివాసి ఈశ్వరయ్య కన్పించడంలేదని ఆయన భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్‌ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈశ్వరయ్య 29 వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. మార్చి నెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇతను వారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఇతడిని ఎవరైనా దాచిఉంచారో లేక అతనే ఎక్కడికైనా వెళ్లాడో అంతుచిక్కక అతడి భార్య, కుటుంబసభ్యులు టీడీపీ నేతలను ఆశ్రయించారు. దీంతో టీడీపీ నేతలు, బాధితులు కలిసి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీవారే ఈశ్వరయ్యను కిడ్నాప్‌ చేశారని రెండురోజుల్లో అతడిని తీసుకు రావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా ఈశ్వరయ్య ఎక్కడికీ వెళ్లలేదని వరికోతలకు వెళ్లాడని అన్నారు. రెండు మూడు రోజుల్లో వస్తానని తనతో ఫోనలో చెప్పాడని అన్నారు.

Updated Date - 2021-02-27T05:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising