ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండికోట ప్రాజెక్టును పరిశీలించిన చీఫ్‌ ఇంజనీర్‌

ABN, First Publish Date - 2021-11-21T05:47:11+05:30

గండికోట ప్రాజెక్టును చీఫ్‌ ఇంజనీర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, నవంబరు 20: గండికోట ప్రాజెక్టును చీఫ్‌ ఇంజనీర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించారు. వరదల నేపథ్యంలో గండికోట ప్రాజెక్టుకు పెన్నా, చిత్రావతి నదుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం గండికోటకు వరదనీటి ద్వారా 90వేల క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. శుక్రవారం లక్షకు పైగా క్యూసెక్కులు వస్తుండగా శనివారం కొంతమేర తగ్గినట్లు వారు వివరించారు. వచ్చే నీటిని (90వేల క్యూసెక్కులు) యదాతథంగా  మైలవరం జలాశయానికి వదులుతున్నట్లు వారు వివరించారు. ప్రస్తు తం ఆరు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నట్లు తెలిపారు.  ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఉమామహేశ్వరావు, జేఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-21T05:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising