వివేకా హత్య కేసులో రెండు నెలలుగా కొనసాగుతున్న సీబీఐ విచారణ
ABN, First Publish Date - 2021-08-03T00:50:29+05:30
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు నెలలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా నివాసాన్ని
కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు నెలలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా నివాసాన్ని, పరిసర ప్రాంతాలను మరోసారి సీబీఐ బృందం పరిశీలించింది. వైఎస్ వివేకా నివాస ప్రాంతంలో సర్వేయర్లతో సీబీఐ కొలతలు వేయించింది. విఆర్ఓ, సర్వేయర్లను అడిగి సీబీఐ బృందం వివరాలు తెలుసుకుంది.
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆదివారం కడప కేంద్ర కారాగార ఆవరణంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారించారు. అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్, గోవర్ధన్లను విచారించినట్లు తెలిసింది. వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందులకు చెందిన సునీల్కుమార్యాదవ్కు వీరు బంధువులు కావడంతో అతడితో వీరికున్న సంబంధాల కారణంగానే ఆ దిశగా వీరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2021-08-03T00:50:29+05:30 IST