కొవిడ్ నిబంధనలు పాటించని ఏడుగురిపై కేసు
ABN, First Publish Date - 2021-05-18T05:20:44+05:30
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కిరాణా, ఇతర షాపులు నిర్వహిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు.
పులివెందుల టౌన్, మే 17: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కిరాణా, ఇతర షాపులు నిర్వహిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం డీఎస్పీ శ్రీనివాసులు సూచనల మేరకు పూలంగళ్ల సర్కిల్, ఆర్టీసీ సర్కిల్లో కర్ఫ్యూ అమలును పర్యవేక్షించామని తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని షాపుల యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా దుకాణాదారులు కరోనా బారిన పడినట్లయితే, వారే స్వచ్చందంగా వారి షాపులను మూసివేసి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయటకు తిరిగినచో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2021-05-18T05:20:44+05:30 IST