అమ్మవారికి బోనాల సమర్పణ
ABN, First Publish Date - 2021-07-30T05:07:55+05:30
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎల్లమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.
సిద్దవటం, జూలై 29 : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఎల్లమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. మండలంలోని పెద్దపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన ఎల్లమ్మ అమ్మవారికి గురువారం ఉదయం మార్కెట్యార్డ్ చైర్మన్ రాజేశ్వరిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు గంపలో తీసుకొని కాలినడకన ఆలయం వద్దకు వెళ్లారు. పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఈసందర్భంగా ఏకుల రాజేశ్వరిరెడ్డి మాట్లాడుతూ పూర్వం వర్షాలు పడకపోతే ప్రజలందరూ కలిసి వరుణదేవుడికి పూజ లు చేసేవారని, అదే విధంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఈపూజలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుర్రా చిన్నక్క, నాగం నరసింహారెడ్డి, గ్రామ కమిటీ ప్రతా ప్ నాయుడు, రామ్మోహన్నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-30T05:07:55+05:30 IST