ఆరుగురు మట్కా బీటర్ల అరెస్టు
ABN, First Publish Date - 2021-07-25T04:44:19+05:30
ఆరుగురు మట్కా బీటర్ల అరెస్టు
రూ.23 వేలు నగదు స్వాధీనం
ఖాజీపేట, జూలై 24: ఆరుగురు మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.23 వేలు నగదు స్వా ధీనం చేసకున్నా మని ఎస్ఐ కుళా యప్ప తెలిపారు. ఖాజీపేట పోలీసు స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ అందిన సమాచారం మే రకు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచామన్నారు.
డామ్కాన్ పల్లె వద్ద మట్కా ఆడుతుండగా దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నామ న్నారు. వారి నుంచి మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. తవ్వారుపల్లె వద్ద కోడిపందేల స్థావరాలపై దాడులు నిర్వహించామ న్నారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.15,690 నగ దు, రెండు కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2021-07-25T04:44:19+05:30 IST