ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద సాయంలో రసాభాస

ABN, First Publish Date - 2021-12-01T04:48:54+05:30

రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెలో మంగళవారం చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరద సాయం పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది.

చీఫ్‌విప్‌తో మాట్లాడుతున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు

రాయచోటి, నవంబరు 30: రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెలో మంగళవారం చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరద సాయం పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వలంటీర్‌ కేవలం వైసీపీ వర్గీయుల పేర్లు మాత్ర మే నమోదు చేశారని ఆరోపిస్తూ.. గ్రామస్థులు నష్టపరిహారం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌ను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. కాగా ఇళ్ల ముందు వాన నీరు ప్రవహిస్తుండంతో పాచిపట్టి ఇబ్బందిగా ఉందని, డ్రైనేజి కాలువలు నిర్మించాలని గ్రామస్థులు చీఫ్‌ విప్‌ను కోరారు. వైసీపీ నాయకులు అడ్డుచెప్పడంతో గొడవ జరిగింది. వెంటనే ఆయన స్పందించి అర్హులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు పోలు సుబ్బారెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు రమే్‌షతో పాటు తహసీల్దార్‌ సుబ్రమణ్యంరె డ్డి, ఎంపీడీఓ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T04:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising