సచివాలయ నిర్మాణాలను వేగవంతం చేయండి
ABN, First Publish Date - 2021-06-18T04:47:46+05:30
మండల పరిధిలోని నూతన సచివాలయాల పనులను వేగవం తం చేయాలని జాయి ంట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు.
ఒంటిమిట్ట, జూన్17 : మండల పరిధిలోని నూతన సచివాలయాల పనులను వేగవం తం చేయాలని జాయి ంట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఒంటిమిట్ట సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సచివాలయ పనుల్లో నాణ్యత ప్రమాణాలతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు విజయకుమారి, ఈఈ రామచంద్రారెడ్డి, ఏఈ సుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-06-18T04:47:46+05:30 IST