1,746 కేసులు నమోదు
ABN, First Publish Date - 2021-05-13T05:08:29+05:30
జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24గంటల వ్యవధిలో మరో 1,746 మంది వైరస్ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటినలో వెల్లడించింది.
కడప, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24గంటల వ్యవధిలో మరో 1,746 మంది వైరస్ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటినలో వెల్లడించింది. మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ ఆసుపత్రుల్లో కోలుకున్న 903 మందిని డిశ్చార్జి చేశారు. 7,118 మంది హోం ఐసోలేషనలో, 1,949 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 76,961కి చేరుకుంది. 67,155 మంది కోలుకున్నారు.. ఇప్పటి వరకు 577 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది. కేసుల నమోదు కడపలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే రోజు 328 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.
మండలాల వారీగా కేసులు...
జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 328, పులివెందుల 133, రాయచోటి 93, కమలాపురం 73, ఎర్రగుంట్ల 73, బద్వేలు 64, సింహాద్రిపురం 55, సీకేదిన్నె 48, ప్రొద్దుటూరు 44, రాజంపేట 44, తొండూరు 43, రైల్వేకోడూరు 42, టి.సుండుపల్లె 37, వేంపల్లె 32, ఎల్ఆర్పల్లె 31, రామాపురం 31, వీరబల్లె 31, వేముల మండలంలో 30 కేసులు నమోదయ్యాయి. అలాగే కొండాపురం మండలంలో 27, పెనగలూరు 26, సంబేపల్లె 26, వీఎనపల్లె 25, చక్రాయపేట 25, చెన్నూరు 24, ఖాజీపేట 24, నందలూరు 23, పెండ్లిమర్రి 23, పోరుమామిళ్ల 22, గాలివీడు 20, వల్లూరు 20, పుల్లంపేట 19, మైదుకూరు 17, కలసపాడు 17, రాజుపాలెం 17, సిద్దవటం 17, ముద్దనూరు 16, దువ్వూరు 15, ఒంటిమిట్ట 14, జమ్మలమడుగు 13, లింగాల 12, చిన్నమండెం 11, చిట్వేలు 10, పెద్దముడియం 9, బి.మఠం 9, బికోడూరు 9, ఓబులవారిపల్లె 7, కాశినాయన 4, చాపాడు 4, మైలవరం 3, అట్లూరు 2, గోపవరం మండలంలో 2 కేసులు, వేరే జిల్లా నుంచి వచ్చిన వారిలో ఒక్క కేసు నమోదయ్యాయి.
ఆక్సిజన
కడప రిమ్స్, ఫాతిమా, ప్రొద్దుటూరు, పులివెందులలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,012 ఆక్సిజన బెడ్లు, 2,549 నాన ఆక్సిజన బెడ్లు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. మొత్తం 3561 బెడ్లు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటినలో వెల్లడించింది. బుధవారం నాటికి 1,949 బెడ్లు నిండాయి. 1,612 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఆక్సిజన బెడ్లు దొరక్క పాజిటివ్ వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చెప్పే లెక్కలకు, వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కొవిడ్ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. దీంతో ఆక్సిజన బెడ్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
Updated Date - 2021-05-13T05:08:29+05:30 IST