వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు
ABN, First Publish Date - 2021-12-06T20:33:40+05:30
నగరంలో వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు.
కడప: నగరంలో వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. సొంతపార్టీ నేతలే అధికారులతో కలసి నిధులు గోల్మాల్ చేశారని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. తమకు కేటాయించిన నిధులు కూడా స్వాహా చేశారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్బాషా కార్యాలయంలో కమిషనర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Updated Date - 2021-12-06T20:33:40+05:30 IST