ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు: టీడీపీ

ABN, First Publish Date - 2021-09-14T23:55:30+05:30

జిల్లాలో వైసీపీ నాయకుల భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో వైసీపీ నాయకుల భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు లింగారెడ్డి, హరిప్రసాద్ ఆరోపించారు. వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డువస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కడప 50వ డివిజన్ టీడీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు చితకబాదారని వారు ఆరోపించారు. సంబంధం లేని కేసుల్లో నేరం ఒప్పుకోవాలని ఆయనను తీవ్రంగా కొట్టారని వారు పేర్కొన్నారు. పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు. 




ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు

నేరం అంగీకరించక పోతే ఎన్‌కౌంటర్ చేస్తామని తనను పోలీసులు బెదిరించారని బాధితుడు వెంకట సుబ్బారెడ్డి అన్నారు. 8న హోటల్లో భోజనం చేస్తుంటే 10 మంది పోలీసులు డీఎస్పీ కార్యాలయానికి తనను తీసుకెళ్లి కొట్టారని ఆయన ఆరోపించారు. వివిధ కేసుల్లో నేరం ఒప్పుకోవాలని తతను కొట్టారన్నారు. సీకే దిన్నే పోలీసు స్టేషన్ తీసుకెళ్ళి మరోసారి కొట్టారని ఆయన తెలిపారు. నేరం అంగీకరించక పోతే తనను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. జిల్లా టీడీపీ నాయకుల చొరవతో తాను బయటపడ్డానని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-09-14T23:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising