జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సత్యనారాయణ మృతి
ABN, First Publish Date - 2021-08-03T08:12:24+05:30
కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ(48) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు.
జేఎన్టీయూకే, ఆగస్టు 2: కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ(48) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వర్సిటీ ఆవరణలో కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మొక్కలు నాటిన ఆయనకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఛాతి నొప్పి రావడంతో కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతుండగా ఆసుపత్రి ఆవరణలో కుప్పకూలిపోయి మరణించారు. ఆయన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్గా రెండుసార్లు, వర్సిటీ అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్గా ఒకసారి పనిచేసి 2019 డిసెంబరు 5న జేఎన్టీయూకే రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. రిజిస్ట్రార్ మృతి పట్ల వర్సిటీ వీసీ రామలింగరాజు, రెక్టార్ ప్రసాదరాజు సంతాపం తెలిపారు.
Updated Date - 2021-08-03T08:12:24+05:30 IST