ప్యాలెస్ వీడి.. ప్రజల్లోకి వెళ్లాలి: జవహర్
ABN, First Publish Date - 2021-05-08T22:24:45+05:30
కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వానికున్న నిర్లక్ష్యం ప్రజలను చంపేస్తోందని.. తక్షణమే వ్యాక్సిన్లు వేయాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులకోసం పెట్టిన ఖర్చులో సగం ఖర్చు చేస్తే రాష్ట్రమంతా ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయొచ్చని తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వీడి, ప్రజల్లోకి వెళ్తే, వారికష్టాలు తెలుస్తాయని జవహర్ పేర్కొన్నారు.
Updated Date - 2021-05-08T22:24:45+05:30 IST