ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థలపై పడింది: జవహర్

ABN, First Publish Date - 2021-09-13T20:27:23+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యా సంస్థలపై పడిందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యా సంస్థలపై పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిడెడ్ సంస్థలను ‘డెడ్’ చేయడమే జగన్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. బ్రిటీష్ హయాం నుంచి, దాతల సహాయ సహకారంతో నడుస్తున్న విద్యా సంస్థలను స్వాధీనం చేసుకొనే హక్కు సీఎంకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్య కోసం దాతలిచ్చిన భూములు, భవనాలను ప్రైటేట్ పరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. నాడు-నేడు కింద ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వం ఎందుకు తగిన వసతులు కల్పించడంలేదని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న.. 90 శాతం మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని జవహర్‌ అన్నారు.

Updated Date - 2021-09-13T20:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising