పవరే పరమావధిగా తలచే వ్యక్తి జూపూడి: జవహర్
ABN, First Publish Date - 2021-09-05T21:55:43+05:30
పవరే పరమావధిగా తలచే వ్యక్తి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అని టీడీపీ నేత కెఎస్ జవహర్ విమర్శించారు.
అమరావతి: పవరే పరమావధిగా తలచే వ్యక్తి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అని టీడీపీ నేత కెఎస్ జవహర్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూపూడి రెండున్నరేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటమేంటి? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని తప్పుబట్టారు. ఎస్సీ అట్రాసిటీ చట్టాలు దుర్వినియోగమౌతుంటే జూపూడి నోరు మెదపలేదన్నారు. జూపూడికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని కెఎస్ జవహర్ హెచ్చరించారు.
Updated Date - 2021-09-05T21:55:43+05:30 IST