జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు: సజ్జల
ABN, First Publish Date - 2021-10-01T22:56:06+05:30
బద్వేల్ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
అమరావతిః బద్వేల్ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని సూచించారు. యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని ఎద్దేవాచేశారు. గోతులు పూడ్చి ఫొటోలుదిగే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని తప్పుబట్టారు. చీప్ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చేయడం పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవుపలికారు. పవన్ స్థాయికి తాము దిగజారాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
Updated Date - 2021-10-01T22:56:06+05:30 IST