ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోంది: పవన్
ABN, First Publish Date - 2021-03-07T19:08:50+05:30
ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోంది: పవన్
అమరావతి: ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలని చెప్పారు. విశాఖలో మున్సిపల్ ఎన్నికల కోసమే వైసీపీ నిరసన స్టంట్లు అన్నారు. 22 మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రత్యేక దృష్టితో చూడాలని అమిత్షాకు చెప్పానని తెలిపారు. పైపైన మాటలు కాకుండా వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. 22 మంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తే ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంలో ప్రజలకు అండగా జనసేన ఉంటుందన్నారు.
Updated Date - 2021-03-07T19:08:50+05:30 IST