ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేధింపులతోనే వెంగయ్య ఆత్మహత్య: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-01-20T02:12:56+05:30

గ్రామంలో అభివృద్ధి జరగాలని చూసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు గొంతు నొక్కేశారని ఆ పార్టీ పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రామంలో అభివృద్ధి జరగాలని చూసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు గొంతు నొక్కేశారని ఆ పార్టీ పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, స్థానిక వైసీపీ నేతల వేధింపులతోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సాయం పవన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడిందని విమర్శించారు. ఇలాంటి చర్యలను జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు. ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Updated Date - 2021-01-20T02:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising