కోర్టుల్లోనే న్యాయం జరుగుతోంది: జనసేన నేత కేతంరెడ్డి
ABN, First Publish Date - 2021-04-14T22:36:00+05:30
ఏపీలోని ప్రజలకు కోర్టుల్లోనే కాస్తోకూస్తో న్యాయం జరుగుతోందని జనసేన నేత కేతంరెడ్డి వినోద్రెడ్డి
నెల్లూరు: ఏపీలోని ప్రజలకు కోర్టుల్లోనే కాస్తోకూస్తో న్యాయం జరుగుతోందని జనసేన నేత కేతంరెడ్డి వినోద్రెడ్డి అన్నారు. ఏపీలో సామాన్యులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని వినోద్రెడ్డి పేర్కొన్నారు. నిద్రలేస్తే వకీల్సాబ్ అంటూ పవన్కల్యాణ్పై కంత్రీసాబ్లు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్ తన ఆస్తులు అమ్ముకున్నారంటూ కట్రా బ్యాచ్ ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎక్కడ ఆస్తులు అమ్ముకున్నాడో, ఎవరికి ఖర్చుపెట్టాడో, అభివృద్ధి ఏం చేశాడో చెప్పాలని మంత్రి అనిల్ను ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2021-04-14T22:36:00+05:30 IST