ఆ సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది: పవన్
ABN, First Publish Date - 2021-10-08T19:36:49+05:30
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఎన్ని వాగ్దానాలు చేసినా...ఎన్ని అరుపులు అరిచినా... రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా.... సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు...పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు...ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2021-10-08T19:36:49+05:30 IST