ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న నిరుద్యోగులు

ABN, First Publish Date - 2021-07-07T18:32:04+05:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఊదరగొట్టారని, ఏటా జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తాం‌ అన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తూ.. జాబులు అడిగితే జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. 


జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మామని, ఇప్పుడు  నట్టేట మునిగామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఉద్యోగాల ఖాళీ ఉంటే.. పది‌వేలతో జాబ్ క్యాలెండర్‌ ప్రకటించి అందరనీ మోసం చేశారన్నారు. ‘నేను విన్నాను...‌నేను ఉన్నాను’ అన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. సమస్యలపై జనసేనాని పోరాడాలని కోరుతున్నామని, ఉద్యోగాల కోసం డిగ్రీలు చేత పట్టుకుని లక్షల మంది యువత ఎదురు‌ చూస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి...‌ ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. వారి మాటలను సానుకూలంగా విన్న పవన్.. పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

Updated Date - 2021-07-07T18:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising