వరద బాధితులకు అండగా జనసేన: పవన్
ABN, First Publish Date - 2021-11-24T02:10:17+05:30
వరద బాధితులకు అండగా జనసేన ఉంటుందని ఆ పార్టీ అధినేత
అమరావతి: వరద బాధితులకు అండగా జనసేన ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమకు ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో అనేకమంది పేదల ఇళ్లు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయన్నారు. బాధితులకు జనసేన తరపున నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందించామన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా బాధితులకు అండగా జనసేన తరపున ఉంటామని ట్విటర్లో పవన్ పేర్కొన్నారు.
Updated Date - 2021-11-24T02:10:17+05:30 IST