ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సర్కార్ మరో కొత్త భూదందా

ABN, First Publish Date - 2021-07-29T23:28:43+05:30

ఏపీ సర్కార్ మరో కొత్త భూదందా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించిన రెండు పథకాలు ఉండగానే సర్కార్ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పేరిట మరో గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇల్లు కట్టరు. మధ్య తరగతి వ్యక్తికి ప్లాట్‌ను అమ్ముతారట. పలు శాఖల దగ్గర నిరుపయోగంగా ఉన్న స్థలాలన్నింటినీ ఇందుకు కేటాయిస్తారట. గృహ నిర్మాణ పథకాలు కొత్త కాదు. బలహీన వర్గాలకు ఇళ్ల నుంచి టిడ్కో ఇళ్ల వరకు పేద, మధ్య తరగతి వర్గాల కోసం చాలా పథకాలు అమలవుతున్నాయి. 


ఇక ఉద్యోగులు మధ్య తరగతి కోసం హౌసింగ్ బోర్డు కాలనీలు ఎన్నో ఉన్నాయి. కానీ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పేరిట వైసీపీ సర్కార్ తీసుకున్న కొత్త పథకంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మధ్య తరగతికి ప్లాట్లు కేటాయించే పథకం కాదని, ఆ పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించే పన్నాగమనే వాదన వినిపిస్తోంది. బిల్డ్ ఏపీ మిషన్ కింద ప్రభుత్వ శాఖలకు చెందిన భూములను అమ్మాలని భావించారు. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ వేలం వేయాలనుకున్నారు. కానీ ఈ వ్యవహారం న్యాయ వివాదాల్లో చిక్కుకుపోయింది. ఇదే సమయంలో జగనన్న టౌన్‌షిప్‌లు తెరపైకి వచ్చాయి. ఇక్కడ జరిగేది ప్రభుత్వ భూములను విక్రయించడం. కాకపోతే మధ్య తరగతి ప్లాట్లు అనే పేరుతో అమ్మేస్తారు. 




Updated Date - 2021-07-29T23:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising