జగన్ సాక్షిగా వైసీపీలో బహిర్గతమైన విభేదాలు
ABN, First Publish Date - 2021-12-24T00:53:06+05:30
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సీఎం జగన్ బహిరంగసభలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సీఎం జగన్ బహిరంగసభలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ల మధ్య విభేదాలు సీఎం సమక్షంలోనే స్పష్టంగా కన్పించాయి. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎంపీ అవినాశ్రెడ్డి, డిప్యూటీ అంజాద్బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవిలకు మాత్రమే వేదికపై మాట్లాడేందుకు ఆహ్వానించారు. ఆ తర్వాత జగన్ మాట్లాడాల్సి ఉంది. అదే వేదికపై ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొద్దుటూరు వాసి ఎమ్మెల్సీ రమేశ్యాదవ్కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది గమనించిన సీఎం జగన్ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ను మాట్లాడించమని ఎమ్మెల్యే రాచమల్లుకు సూచన చేయడంతో అతనికి మైక్ ఇచ్చారు. రమేశ్ మాట్లాడుతుండగా, సభికులు గట్టిగా కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు.
Updated Date - 2021-12-24T00:53:06+05:30 IST