ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఉద్యోగులకు Good News.. నేటి సాయంత్రం జగన్ సర్కార్ కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-12-13T19:18:51+05:30

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేటి సాయంత్రం పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా పీఆర్సీ క‌సరత్తు పూర్తైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేటి సాయంత్రం పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా పీఆర్సీ క‌సరత్తు పూర్తైంది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నోట్ రెడీ చేసింది. ఈ సాయంత్రం రిపోర్ట్‌ను సీఎస్‌కు సీఎం జగన్‌కు ఇవ్వనున్నారు. అనంతరం ఉద్యోగ సంఘాలకూ రిపోర్ట్ ఇవ్వనున్నారు. అనంతరం పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం అవకాశం ఉంది. ఈ సమావేశానంతరం జగన్ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది. 


పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. రాష్టంలో ఇప్పటికే ఐదు డీఏలు పెండింగులో ఉన్నాయి. జనవరి వస్తే దీనికి మరో డీఏ యాడ్ కానుంది. ఈ డీఏలను వెంటనే ప్రకటించాలని సైతం ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. పీఆర్సీ తరువాత డీఏలను పరిష్కరిస్తారన్నారు. మొత్తానికి నేటి సాయంత్రానికి పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-13T19:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising