టెన్త్, ఇంటర్ పరీక్షలపై నేడు సీఎం జగన్ సమీక్ష
ABN, First Publish Date - 2021-06-17T17:11:14+05:30
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఓవైపు కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి. కేంద్రం సయితం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం పరీక్షలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. టెన్త్, ఇంటర్కు సంబంధించి పరీక్షల షెడ్యూల్ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Updated Date - 2021-06-17T17:11:14+05:30 IST