మోదీకి జగన్ లేఖ
ABN, First Publish Date - 2021-05-22T22:50:01+05:30
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కోరారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు..
అమరావతి: ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కోరారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు.. సరిపడా డోసులను కేంద్రం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ వాళ్లు కూడా 50శాతం వ్యాక్సిన్లను ఉత్పత్తిదారుల నుంచి.. కొనుగోలు చేసే అవకాశంపై పునరాలోచించాలన్నారు. వ్యాక్సిన్ను ఉచితంగా లేదా నామమాత్రపు రేట్లకు ఇవ్వాలని జగన్ కోరారు.
Updated Date - 2021-05-22T22:50:01+05:30 IST