ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ABN, First Publish Date - 2021-06-04T22:51:03+05:30

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి. పీఆర్ ఎనర్జీపై అభియోగాల నమోదుపై విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. ఈడీ కేసులపై విచారణ ఈనెల 22కి కోర్టు వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ చార్జ్‌షీట్ విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. అక్రమాస్తుల కేసుల్లో బెయిలుపై ఉన్న జగన్‌కు జారీచేసిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యాజ్యాన్ని సాంకేతిక కారణాలపై సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో రఘురామ మరో వారం తర్వాత సవరించిన వ్యాజ్యాన్ని మరోసారి దాఖలు చేశారు. సీఎంపై అక్రమాస్తులకు సంబంధించి 11 కేసులు ఉన్నాయని, అన్నింటిలోనూ జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. ఆయనకు జారీచేసిన బెయిలు రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు.

Updated Date - 2021-06-04T22:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising