ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మత మారణహోమం సృష్టించాలని జగన్ చూస్తున్నాడు: బండారు

ABN, First Publish Date - 2021-01-17T21:55:49+05:30

సీఎం జగన్, ఆయన బావ బ్రదర్‌ అనిల్‌ తీరు వల్లే రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత బండారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్, ఆయన బావ బ్రదర్‌ అనిల్‌ తీరు వల్లే రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ పాలనలో మతమార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయనడానికి.. పాస్టర్‌ ప్రవీణ్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రవీణ్‌లాంటి వారిని రాష్ట్రంపైకి వదిలేసి ఎంపీ విజయసాయిరెడ్డి అండతో.. ఏపీలో మతమారణహోమం సృష్టించాలని జగన్ చూస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.


ఇదే విషయంపై అంతకుముందు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు.  ‘‘హిందూ దేవుళ్ల విగ్రహాలను నేను పగలుగొట్టాను, కాలితో తన్నాను, మత మార్పిడులు చేశానని చెప్పిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసి నాలుగు రోజులయ్యింది. ప్రవీణ్‌ను ఇప్పటి వరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు. ప్రవీణ్‌ వెనుక ఎవరు ఉన్నారు’’ అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. 

Updated Date - 2021-01-17T21:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising