పోలవరంలో ఇరిగేషన్ సెక్రటరీ పర్యటన
ABN, First Publish Date - 2021-12-17T00:03:36+05:30
ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ జవహర్ రెడ్డి గురువారం పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తొలుత హిల్వ్యూ ప్రాంతం నుంచి స్పిల్వే, స్పిల్ చానల్
పోలవరం: ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ జవహర్ రెడ్డి గురువారం పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తొలుత హిల్వ్యూ ప్రాంతం నుంచి స్పిల్వే, స్పిల్ చానల్, ఆప్రోచ్ చానల్లను పరిశీలించారు. అనంతరం ఆయన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రంవాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 ప్రాంతాలను, స్పిల్వే, రేడియల్ గేట్లు, ఫిష్ ల్యాడర్, పవర్ హౌజ్, స్పిల్వేలో ఆప్రోచ్ చానల్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో హెడ్ రెగ్యులేటర్, ఫేజ్ 4, ఫేజ్ 5 లలో జంటగుహల నిర్మాణం పనులు పరిశీలించారు.
Updated Date - 2021-12-17T00:03:36+05:30 IST