స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ అక్రమాలపై విచారణ
ABN, First Publish Date - 2021-06-17T00:05:26+05:30
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ
విజయవాడ: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరుపాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ (SPA)లో అక్రమాలపై వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలోని అక్రమాలపై జీఎంఎస్వీ ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్పీఏ డైరెక్టర్ అక్రమాలు, అవినీతిపై దర్యాప్తు జరపాల కోరాడు. ఫిర్యాదులపై చర్యలు లేకపోవడంతో హైకోర్టును పిటిషనర్ ప్రసాద్ ఆశ్రయించాడు. సంస్థలో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.
Updated Date - 2021-06-17T00:05:26+05:30 IST