బీజేపీలోకి ముద్రగడకు ఆహ్వానం: సోము
ABN, First Publish Date - 2021-01-17T08:33:35+05:30
‘‘రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయాల్లో మార్పు కోసమే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కలిశాం. ఆయనను పార్టీలోకి ఆహ్వానించాం’’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
కిర్లంపూడి, జనవరి 16: ‘‘రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయాల్లో మార్పు కోసమే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కలిశాం. ఆయనను పార్టీలోకి ఆహ్వానించాం’’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో శనివారం ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుని తెలియజేస్తానని ముద్రగడ చెప్పారన్నారు.
Updated Date - 2021-01-17T08:33:35+05:30 IST