‘పీఎం కిసాన్’లో చిన్న రైతులకు అన్యాయం
ABN, First Publish Date - 2021-12-04T08:37:33+05:30
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో తమ పేర్లు నమోదు చేయించుకోలేని చిన్న, సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని,
న్యూఢిల్లీ, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో తమ పేర్లు నమోదు చేయించుకోలేని చిన్న, సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని, రిజిస్ర్టేషన్ జరగలేదన్న కారణంతో లబ్ధి పొందలేకపోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి) కేంద్రం దృష్టికి తెచ్చారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ప్రశ్నించారు. నెల్లూరు తదితర జిల్లాల్లో దాదాపు 40శాతం మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందే అర్హత కోల్పోయారని తెలిపారు. రైతులకు ఈ పథకం పట్ల అవగాహన కల్పించడంతోపాటు ఎన్జీవోలు, పంచాయతీలకు రిజ్రిస్ర్టేషన్ బాధ్యతలు అప్పగించాలని కోరారు.
Updated Date - 2021-12-04T08:37:33+05:30 IST