పెరిగిన ఎండ
ABN, First Publish Date - 2021-01-24T08:33:08+05:30
రాష్ట్రంలో తూర్పుగాలుల ప్రభావంతో పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంది.
విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తూర్పుగాలుల ప్రభావంతో పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంది. దీంతో పగటిపూట ఎండ స్వల్పంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయు. శనివారం నందిగామలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా తూర్పుగాలుల ప్రభావంతో పొగమంచు కురిసింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2021-01-24T08:33:08+05:30 IST