ఐఏఎస్ల సంఘం స్పందించాలి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు
ABN, First Publish Date - 2021-09-03T21:48:40+05:30
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఐఏఎస్ల సంఘం స్పందించాలని...
విజయవాడ: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఐఏఎస్ల సంఘం స్పందించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు డిమాండ్ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై అధికారుల వేధింపులను ఆపాలని తెలిపారు. ఉద్యోగ సంఘాలు దీనిపై మాట్లాడాలన్నారు. ఐఏఎస్లు ప్రభుత్వం తీసుకునే చట్ట విరుద్ధ నిర్ణయాలను వ్యతిరేకించాలని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-09-03T21:48:40+05:30 IST