ఏపీలో దేవాదాయ భూముల వేలం ఆదేశాలపై పిటిషన్
ABN, First Publish Date - 2021-06-15T21:05:15+05:30
ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కోవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్ధించిన హైకోర్టు.. కోవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ జులై 7వ తేదీకి వాయిదావేసింది.
Updated Date - 2021-06-15T21:05:15+05:30 IST