శ్రీకాకుళం జిల్లాలో హై అలర్ట్
ABN, First Publish Date - 2021-09-14T01:06:48+05:30
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో
శ్రీకాకుళం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో హై అలర్ట్ను అధికారులు ప్రకటించారు. వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. ఒడిశాలో గొట్టా బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో 14 గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Updated Date - 2021-09-14T01:06:48+05:30 IST