23 నుంచి ఎద్దుల బండ లాగుడు పోటీలు
ABN, First Publish Date - 2021-01-21T05:39:31+05:30
పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు లో గల క్రీడా స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు బల ప్రదర్శన పోటీల గోడ పత్రికను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు బుధవారం ఆవిష్కరించారు.
నరసరావుపేట రూరల్, జనవరి 20 : పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు లో గల క్రీడా స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు బల ప్రదర్శన పోటీల గోడ పత్రికను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎడ్ల జతలకు పలు విభాగాల్లో రూ.15.60 లక్షల విలువైన బహుమతులను ఇవ్వ నున్నట్టు ఆయన చెప్పారు. కమిటీ సభ్యుడు రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T05:39:31+05:30 IST