నగరానికి చేరుకున్న వీఆర్ఏల బైక్యాత్ర
ABN, First Publish Date - 2021-10-27T05:05:54+05:30
తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు తలపెట్టిన బైక్యాత్ర మంగళవారం గుంటూరుకు చేరుకుంది.
గుంటూరు(తూర్పు), అక్టోబరు 26: తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు తలపెట్టిన బైక్యాత్ర మంగళవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు, పశ్చిమ మండలాలకు చెందిన తహసీల్దార్లకు, వీఆర్ఏలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వీఆర్ఏల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వీఆర్ఏలకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వడంతోపాటు, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల రాష్ట్రవ్యాప్త సమస్యలపై నవంబరు 24న విజయవాడలో సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వై.నేతాజీ, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, శంకర్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-27T05:05:54+05:30 IST