ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ-బస్సు ఢీ.. 19 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-01-22T05:58:33+05:30

వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొన్నది.

నుజ్జునుజ్జయిన బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినుకొండ టౌన్‌, జనవరి 21: వినుకొండ మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొన్నది. దీంతో 19 మంది గాయపడ్డారు. కారంపూడి నుంచి నంద్యాల వెళ్తున్న పైపుల లారీని వేగంగా ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో తెలంగాణలోని కామారెడ్డి డిపో నుంచి నెల్లూరు జిల్లా వింజమూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్‌ పరంధామంతో పాటు మరో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-22T05:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising