రబీ పంటలపై దృష్టి పెట్టాలి
ABN, First Publish Date - 2021-03-03T05:46:33+05:30
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రబీ పంటలపై దృష్టిపెట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్య ఆదేశించారు.
పూనం మాలకొండయ్య
గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రబీ పంటలపై దృష్టిపెట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్య ఆదేశించారు. వెలగపూడి సచివాలయం నుంచి మంగళవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ జిల్లా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె ప్రసంగించారు. కమిషనర్ సీహెచ్ అరుణ్కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రాల్లో లాబ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జిల్లాలో రబీలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు నుంచి పాల్గొన్న వ్యవ సాయశాఖ జేడీ విజయభారతి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ డీడీలు రామాంజనేయులు, మురళి, ఉద్యానవన శాఖ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-03T05:46:33+05:30 IST