విశిష్ట వ్యక్తులకు ఉగాది పురస్కారాలు
ABN, First Publish Date - 2021-04-14T06:07:08+05:30
స్థానిక అమరావతి రోడ్డు అన్నదాన సమాజం ఆడిటోరియంలో భారతీ సాంస్కృతిక, సంగీత కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 150 మందికి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
గుంటూరు(సాంస్కృతికం), ఏప్రిల్ 13: స్థానిక అమరావతి రోడ్డు అన్నదాన సమాజం ఆడిటోరియంలో భారతీ సాంస్కృతిక, సంగీత కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 150 మందికి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. తొలుత భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం జరిగిన సభకు రంగస్థల నటుడు, రచయిత కావూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సంస్థ చైర్మన్ మిరియాల మురళీకృష్ణ, రంగస్థల నటులు నాయుడు గోపి, ఎన్.రవీంద్రారెడ్డి, చెరుకూరి సాంబశివరావు, వరికూటి శివప్రసాద్, పప్పుల ప్రభుదాస్, ఎంవీ రమణమూర్తి, జొన్నలగడ్డ వెంకటరత్నం, వంగల వీరబ్రహ్మాచారి తదితరులు పాల్గొని రంగస్థల నటులను ఘనంగా సత్కరించారు. సాయంత్రం జరిగిన సభలో అడిషనల్ ఎస్పీ కేజీవీ సరిత చేతుల మీదుగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు ఉగాది పురస్కారాలతో సత్కరించారు.
Updated Date - 2021-04-14T06:07:08+05:30 IST