ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై దారుణ ఘటనలు బాధాకరం

ABN, First Publish Date - 2021-08-22T14:17:20+05:30

రాష్ట్రంలో మహిళల దారుణ ఘటనలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఉదాశీన వైఖరితో రెచ్చిపోతున్న ఆకతాయిలు


సత్తెనపల్లి: రాష్ట్రంలో మహిళల దారుణ ఘటనలు జరగటం బాధాకరమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. శనివారం డాక్టర్‌ కోడెల కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినులకు, చిన్నారులకు రక్షణ కరువైందన్నారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉదాశీన వైఖరితో ఆకతాయిలు రెచ్చిపోతున్నారన్నారు. మహిళలపట్ల వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు సయ్యద్‌ పెదకరిముల్లా, పూజల వెంకటకోటయ్య, ఆతుకూరి నాగేశ్వరరావు, బండారు నాగరాజు, దర్శి సురేష్‌, నూర్‌భాష జాన్‌బాబు, ఆంజనేయులు, కొండలు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T14:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising